కొరియా క్షిపణి ప్రయోగంపై జపాన్ అభ్యంతరం
టోక్యో,ఆగస్ట్29(జనంసాక్షి): నార్త్ కొరియా మరోమారు క్షిపణిని పరీక్షించింది. ఈ సారి ఏకంగా జపాన్ దీవి విూద నుంచి ఆ మిస్సైల్ను పరీక్షించింది. ఈ ఘటన పట్ల జపాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా వల్ల జపాన్కు తీవ్ర ప్రమాదం ఉందని ఆ దేశ ప్రధాని షింజో అబే ఈ సందర్భంగా అన్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు ఈ ప్రయోగం జరిగినట్లు తెలుస్తున్నది. జపాన్కు చెందిన హళక్కైడో దీవి విూద నుంచి మిస్సైల్ వెళ్లినట్లు తెలుస్తున్నది. ఈ ప్రయోగం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి హుటాహుటిన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. నిజానికి ఇటీవల నార్త్ కొరియా పదేపదే క్షిపణులను పరీక్షిస్తూనే ఉన్నది. కానీ జపాన్ దీవి విూదుగా ప్రొజెక్టల్స్ను పరీక్షించడం చాలా అరుదైన విషయంగా చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలో వాతావరణం టెన్షన్గా మారింది. నార్త్ కొరియా గతంలోనూ జపాన్ విూదగా రాకెట్లను ప్రయోగించింది. 1998, 2009 సంవత్సరాల్లోనూ ఇలా జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే అవి ఆయుధాలు కాదు, శాటిలైట్ ప్రయోగాలు అని నార్త్ కొరియా పేర్కొన్నది. నార్త్ కొరియా మిస్సైల్ను పరీక్షించిన నేపథ్యంలో ప్రజలంతా షెల్టర్ తీసుకోవాలని జపాన్ ప్రకటన చేసింది. అయితే కొరియా ప్రయోగించిన మిస్సైల్ సుమారు 2700 కిలోవిూటర్లు ప్రయాణించినట్లు తెలుస్తున్నది. 550 కిలోవిూటర్ల ఆల్టిట్యూడ్లో మిస్సైల్ వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. జపాన్ తీరంలో క్షిపణి మూడు ముక్కలై పడినట్లు భావిస్తున్నారు. అయితే ఆ మిస్సైల్ను షూట్ చేయాలన్న ప్రయత్నాలకు జపాన్ వెళ్లలేదు. ప్రస్తుతం హళక్కైడాలోనే జపాన్, అమెరికాకు చెందిన దళాలు సైనిక విన్యాసాలు చేస్తున్నాయి.