గంగోత్రి ప్రాంతంలో పూర్తయిన సహాయక చర్యలు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముగింపు దశకు చేరుకున్నాయి. గంగోత్రి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ వరదల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు.