ఘనంగా విజయ్‌ దివన్‌

న్యూఢిల్లీ : విజయ్‌ దివన్‌ను దేశరాజధానిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి ఆంటోనీతోపాటు ఆర్మీ ఉన్నతాధికారులు పాల్గొని ఇండో-పాక్‌ యుద్ధ అమర వీరులకు నివాళులు అర్పించారు. ఇదే రోజున 1971లో భారత్‌-పాక్‌ యుద్ధం సందర్భంగా సైన్యంతోపాటు పాక్‌ జనరల్‌ అమీర్‌ అబ్దుల్లా ఖాన్‌ భారత్‌కు లొంగిపోయాడు. దీంతో దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 16న విజయ్‌  దివన్‌ను ఘనంగా నిర్వహిస్తారు.