చిత్రావతి నదిపై అక్రమ ప్రాజెక్టులపై సుప్రీంలో నిజదావా

న్యూఢిల్లీ : చిత్రావతి నదిపై కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ నిజదావా దాఖలు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పరగోడు రిజర్వాయర్‌కు నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందని ఆందులో పేర్కొంది. అక్రమ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడుతోందని తెలిపింది. ఎలాంటి అనుమతులు లేకుంగా చిత్రావతి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని వివరించింది. ఆంధ్రప్రదేశ్‌ దాఖలు చేసిన నిజదావాపై మార్చి 31న కోర్టు విచారణ చేపట్టనుంది.