చివరి క్షణాల్లో ప్రశాంతంగా అఫ్జల్‌ గురు

తీహార్‌ జైలు అధికారులు
న్యూఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో తీహార్‌ జైల్లో ఉరిశిక్షను అమలు చేసేముందు అఫ్జల్‌గురు ప్రశాంతంగా కనిపించారని జైలు అధికారులు తెలిపారు. ఈ తెల్లవారుజామున ప్రార్థనలు చేసుకున్నాడని అనంతరం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలుపై అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు ఉరిశిక్ష అమలు అనంతరం అతని మృతదేహాన్ని జైల్లోనే ఖననం చేసినట్లు తెలిపారు.