చైనాలో 5.3 తీవ్రతతో భూకంపం

హైదరాబాద్‌: చైనాలోని జీజాంగ్‌ ప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 5.3గా నమోదైంది. చైనా కాలమానం ప్రకారం ఉదయం 5.18 గంటలకు స్థానిక బేయింగోల్‌ మంగోలియన్‌ ప్రాంతంలో దాదాపు ఐదు కిమీల పరిధిలో భూకంప కేంద్రం అధికారులు తెలిపారు. లుంటాయ్‌ రాష్ట్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.