చైనాలో ఉగ్ర పేలుళ్లు..21 మంది మృతి

.

బీజింగ్‌,ఏప్రిల్‌ 24 :చైనాలో జింగ్‌జాంగ్‌లోని కాష్‌గర్‌ పట్టణంలో ఉగ్రవాదలు బాంబు దాడులకు తెగబడ్డారు.ఈ ఘటనలో 21 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు.ఇందులో పోలీసులు కూడా ఉన్నారన్నారు.ఆరుగురు అనుమానితులు పోలీసు కాల్పుల్లో చనిపోయారని,ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది.చైనాలో కొత్త నాయకత్వం పగ్గాలు చేపట్టాక ఇదే తొలి ఉగ్రవాద దాడి.