జమ్ములో తగ్గుముఖం పట్టిన వరదలు

1oa5nj9bజమ్ముకాశ్మీర్‌లో వరదలు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటలుగా వర్షం కురవకపోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఉపశమనం లభించింది. జీలం నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయి దిగువకు చేరింది. ఐతే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వరదల్లో చనిపోయిన 15 మంది మృతదేహాలను ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు వెలికి తీశాయి. కాగా రాగాల 48 గంటల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరిక.. స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.