టీ తోట యజమాని భవంతికి నిప్పు : ఇద్దరి సజీవదహనం

అస్సాం : అస్సాంలోని తీన్‌సుకియా జిల్లాలో ఒక టీ తోట యజమాని భవంతికి కార్మికులు నిప్పు పెట్టగా ఇద్దరు సజీవదహనమయ్యారు. టీ తోటలో పనిచేస్తున్న కార్మికులకు, యజమానికి మధ్య తలెత్తిన వివాదమే ఈ దారుణానికి కారణమని భావిస్తున్నారు. సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి తరుణ్‌గొగోయ్‌ తెలియజేశారు.