టోర్నీ మొత్తం డబ్బు ఛారిటీకి

ఫ్రాన్‌ సాకర్‌ ఆటగాడి దాతృత్వం

పారిస్‌,జూలై17(జ‌నం సాక్షి): రష్యా వేదికగా ఇటీవల ముగిసిన ఫిఫా ప్రపంచకప్‌ పోటీల్లో ఫ్రాన్స్‌ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించిన ఆ జట్టు ఆటగాడు ఎంబపె దాతృత్తంవ చాటుకున్‌ఆనడు. ఫైనల్లో గోల్‌ కొట్టి ఫ్రాన్స్‌కు ఆధిక్యాన్ని అందించాడు. అంతేకాదు ప్రపంచకప్‌ ఫైనల్లో గోల్‌ కొట్టిన పిన్న వయస్కుడిగా కూడా ఎంబపె రికార్డు సృస్టించాడు. ఈ 19 ఏళ్ల యువ సంచలనం ఇప్పుడు ఫ్రాన్స్‌ హీరో అయ్యాడు. ఈ టోర్నీ ద్వారా తాను అందుకునే మొత్తాన్ని ఛారిటీకి ఇస్తున్నట్లు ప్రకటించి అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు.ప్రపంచకప్‌లో ఆడినందుకు ఒక్కో మ్యాచ్‌కు గాను అతడు 22,500 డాలర్ల(ఈ టోర్నీలో అతడు ఎనిమిది మ్యాచ్‌లు ఆడాడు)తో పాటు ్గ/నైల్‌లో విజేతగా నిలిచినందుకు సుమారు 3.5లక్షల డాలర్లను అదనంగా అందుకుంటాడు. ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీ ద్వారా ఎంబపె సుమారు 5లక్షల డాలర్లను అందుకోన్నాడు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.3.4కోట్లకు పైనే. ఈ మొత్తాన్ని అతడు ఛారిటీకి ఇవ్వనున్నట్లు తెలిపి తన దాతృత్వాన్ని చాటాడు. క్రీడాభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతోన్న చిన్నారులకు ఈ మొత్తాన్ని వాడాలని స్వచ్ఛంద సంస్థను ఎంబపె కోరాడట.విశ్వ విజేతగా నిలిచిన ఫ్రాన్స్‌ జట్టు ఆటగాళ్లకు సొంతగడ్డపై ఊహించని రీతిలో స్వాగతం దక్కింది. దేశానికి అత్యున్నత సేవలు అందించిన వారికి ప్రకటించే లిజియన్‌ ఆఫ్‌ హానర్‌ అవార్డుతో ఆటగాళ్లను సత్కరించాలని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ నిర్ణయం తీసుకున్నారు.