డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత

చెన్నై: డీఎంకే పార్టీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డా. కళైజ్ఞర్ గా ప్రసిద్ధి చెందిన ముత్తువేల్ కరుణానిధి(95) కన్నుమూశారు. తీవ్ర జ్వరం, మూత్ర పిండాల సమస్య కారణంగా పది రోజుల క్రితం చెన్నైలోని కావేరి దవాఖానలో కరుణానిధి చేరిన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమించడంతో నేడు ఆయన మృతిచెందారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటనను విడుదల చేశాయి.