ఢిల్లీలో జనవరి నుంచి 60 స్వైన్‌ప్లూ కేసులు

న్యూఢిల్లీ : దేశరాజధానిలో స్వైన్‌ప్లూ మరోసారి విజృంభిస్తోంది. ఈ జనవరి నుంచి వివిధ ప్రాంతాల్లో 60 కేసులు నమోదైనట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి ఏకే వాలియా తెలిపారు. ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. స్వైన్‌ప్లూపై ప్రభుత్వం అప్రమత్తమైందని, చికిత్స కోసం 22 ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాట్లు  చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.