ఢిల్లీ ఘటనలో ఆరో నిందితుడు అరెస్టు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ ప్రైవేటు బస్సులో వైద్య విద్యార్థిని పై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో ఆరో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. ఔరంగాబాద్‌లో నిందితున్ని పట్టుకోని ఢిల్లీకి తరలించినట్లు చెప్పారు. అయితే నిందితుని వివరాలు వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ ఘటనలో ఇప్పటికే బస్సు డ్రైవర్‌, అతని సోదరునితోపాటు ముగ్గురికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు అత్యాచారం ఘటనలో బాధితురాలు క్రమంగా కోలుకుంటోందని సఫ్దర్‌జంగ్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు.