నెత్తురోడిన లాహోర్‌

పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. లాహోర్ యెహోనాదాద్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో నలుగురు మృతి చెందగా, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పేలుళ్ల నేపథ్యంలో అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమైంది. అటు ఘటనా స్థలంలో ఇద్దరు అనుమానితులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నారు.