నేటి నుంచి భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు

న్యూఢిల్లీ : భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు కార్యవర్గ కమిటీ సమావేశం జరగనుంది. రేపటి నుంచి రెండు రోజులపాటు పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. రాజ్‌నాథ్‌సింగ్‌ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై నేతలు చర్చించనున్నారు. ఈ సంవత్సరంలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2014లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్థం చేసే దిశగా ఈ సమావేశాలు జరగనున్నాయి. యూపీఏ హయాంలో చోటుచేసుకుంటున్నా అవినీతి, ధరల పెరుగుదల, అంతర్గత భద్రత తదితర అంశాలపై కూడా నేతలు చర్చించనున్నారు.