నేడు, రేపు స్టాక్ మార్కెట్లకు సెలవు
ముంబయి: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండురోజులు మూసివేసివుంచనున్నారు. మహావీర్ జయంతి సందర్భంగా ఈ రోజు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్తోపాటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లలో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. వీటితోపాటు ఫారెక్స్, మనీ, ఆయిల్సీడ్స్ మార్కెట్లు కూడా మూసివేసివుంచనున్నారు. 3న గుడ్ఫ్రైడే సందర్భంగా స్టాక్ మార్కెట్లతోపాటు మెటల్, షుగర్, పేపర్, కమోడిటీ, ఫారెక్స్, మనీ మార్కెట్లు సెలవు పాటించనున్నాయి.