నేడు శ్రీలంక వెళ్లనున్న ప్రధాని మోడీ

p8ctiwphఐదు రోజుల విదేశి పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శ్రీలంకలో పర్యటించనున్నారు. 28 ఏళ్ల తర్వాత శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనతో సమావేశం కానున్నారు. అనంతరం శ్రీలంక పార్లమెంట్ను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. భారత ప్రభుత్వ సహకారంతో జాఫ్నాలో నిర్మించిన 20 వేల నివాస సముదాయాలన్ని ప్రధాని సందర్శించనున్నారు.