నేపాల్లో మళ్లీ భూప్రకంపనలు..

కఠ్మాండు: వరుస భూకంపాలతో కకావికలమవుతోన్న నేపాల్ లో శుక్రవారం మరోసారి భూమి కంపించింది. రాజధాని కఠ్మాండుకు 52 కిలోమీటర్ల దూరంలోని ధదింగ్ జిల్లా కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదయినట్లు నేపాల్ జాతీయ భూకంప విజ్ఞాన కేంద్రం చీఫ్ లోక్ బిజయ అధికారి తెలిపారు.