నైజీరియాలో ఆత్మాహుతి దాడి

నైజీరియాలో టీనేజ్‌ సూసైడ్‌ బాంబర్లు దారుణానికి ఒడిగట్టారు. ఉత్తర నైజీరియాలో రద్దీగా ఉండే రెండు బస్‌ స్టేషన్‌లలో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు 25 మంది ప్రయాణికుల ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. బోకో హరం టెర్రరిస్టులు ఈ ఆత్మాహుతీ దాడులకు పాల్పడి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నైజీరియా అధికారులు. ఈ ఏడాది ముస్లింలను టార్గెట్‌ చేసుకుని దాదాపు పదివేల మంది అమాయకుల ప్రాణాలు బలికొన్నారని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.