నోరు జారాడంతో నిరసన చేపట్టిన భాజపా

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత ఒకరు మరోసారి నోరు జారారు. సత్యదేవ్‌ కటారే అనే నాయకుడు భిండ్‌ జిల్లాలో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ మహిళల ప్రవర్తనను బట్టే పురుషులు వారిని వేధిస్తారని పేర్కొన్నారు. మహిళలపట్ల ఇంత నీచంగా మాట్లాడడం కాంగ్రెస్‌ నేతల దిగజారుడుతనాన్ని సూచిస్తోందని ఆ రాష్ట్ర భాజపా నేతలు విమర్శలు గుప్పించారు.