పరిస్థితి అదుపులో ఉంది

జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పారామిలటరీ దళాలను పెద్ద సంఖ్యలో పంపించామని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. వరదల ప్రభావం వలన ఇప్పటివరకు 16 మంది మృతి చెందారని చెప్పారు. సహాయక చర్యల కోసం కేంద్రం ఇప్పటికే 200 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు.