పాక్‌లో రెండు రైళ్లు ఢీ: ఆరుగురి మృతి


trainderail15
 ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కరాచీ వెళ్తున్న అవామ్ ఎక్స్‌ప్రెస్ అదే ట్రాక్ నిలిపి ఉన్న గూడ్స్‌ను ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, 150 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి విషయంగా ఉంది. క్షతగాత్రులను ముల్తాన్‌లోని రైల్వే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ముల్తాన్ సమీపంలోని క్వెటాలో జరిగింది. రైల్వే శాఖ దీనిపై స్పందించి ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.