పెరూలో లోయలో పడ్డ బస్సు:21 మంది మృతి

హైదరాబాద్:పెరూలోని ఆయాకుచో ప్రావిన్స్‌లోని ఆండీస్ పర్వత శ్రేణుల సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిన ఈ ఘటనలో 21 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.