ప్రమాణస్వీకారం చేసిన మేరీకోమ్, సుబ్రహ్మణ్య స్వామి…
న్యూదిల్లీ : మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి, ఒలింపిక్ పతక విజేత మేరీకోమ్లు మంగళవారం రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం కూడా మొత్తం తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తొమ్మిది మందిలో ఐదుగురు కాంగ్రెస్, ఇద్దరు సీపీఎం, శిరోమణి అకాళీదళ్, భాజపాల నుంచి చెరొకరు చొప్పున రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారాలు చేశారు.
కాంగ్రెస్ తరఫున.. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎన్నికైన ఆనంద్ శర్మ, అస్సాం నుంచి రాణీ నారా, రిపున్ బోరాలు, పంజాబ్ నుంచి ప్రతాప్ సింగ్ బజ్వా, షంషేర్ సింగ్లు రాజ్యసభలో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.
సీపీఐఎం తరఫున… త్రిపుర నుంచి జర్న దాస్ బైద్యా, కేరళ నుంచి సోమ ప్రసాద్లు ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే భాజపా తరఫున పంజాబ్ నుంచి శ్వేత్ మాలిక్, శిరోమణి అకాలీదళ్ నుంచి నరేశ్ గుజ్రాల్లు ప్రమాణ స్వీకారం చేశారు.