బంగ్లాదేశ్‌లో హిందువుల పై దాడి

 బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందు వులకు రక్షణ లేకుండాపోతోంది. వారిపై దాడులు ఎక్కువవుతున్నాయి. గత నెల 30వ తేదీన ముస్లిం మతానికి చెందిన 3వేల మంది ఓ హిందూ గ్రామంపై  bangladesh-islamic-terrorism-300x2032మూకుమ్మడిగా దాడి చేసి 10 హిందూ దేవాల యాలను, వందలాది ఇళ్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో, దాదాపు 100 మంది హిందువులు తీవ్రంగా గాయపడ్డారు. మత్స్యకారుడైన రసరాజ్‌ దాస్‌ ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా ఫేస్‌ బుక్‌ ద్వారా పోస్ట్‌ చేశాడని దాడికి పాల్పడ్డ దుండగులు ఆరోపించారు. అయితే, తన ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ ను ఎవరో హ్యాక్‌ చేసి ఆ పోస్టులు పెట్టారని రసరాజ్‌ వాపోయాడు. అంతేకాదు, ముస్లింలకు బేషరతుగా క్షమా పణలు కూడా చెప్పాడు. అయినప్పటికీ, అతడిని దుండగులు తీవ్రంగా కొట్టి, పోలీసులకు అప్పగించారు. అధికార అవామీలీగ్‌ పార్టీకి రసరజ్‌ మద్దతు దారుడు.