బెంగాల్‌ బరిలో జెఎన్‌యు అధ్యక్షురాలు ఆయుషి ఘోష్‌


కోల్‌కతా11 మార్చి (జనంసాక్షి) :  మరో విద్యార్థి నాయకురాలు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ పశ్చిమ బెంగాల్‌ శాసనసభ ఎన్ని కల్లో పోటీ చేస్తున్నారు. సీపీఎం తరఫున ఆమె బరిలోకి దిగుతు న్నారు. ఈ విషయాన్ని అయిషీ నేడు ట్విటర్‌ ద్వారా వెల్లడిం చారు. ‘సంయుక్త మోర్చా మద్దతుతో జమురియా శాసనసభ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నాకు అండగా ఉండాలని ప్రతిఒక్కరిని కోరుతున్నా” గతేడాది జేఎన్‌యూ ప్రాంగణంలో జరిగిన హింసాత్మక దాడిలో అయిషీ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. కొంతమంది ఆగంతకులు యూనివర్శిటీ క్యాంపస్‌లోకి చొరబడి ఇనుపరాడ్లు, గాజు సీసాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులపై దాడికి పాల్పడ్డారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. ఏబీవీపీ కార్యకర్తలే తమపై దాడి చేశారని జేఎన్‌యూ విద్యార్థి సంఘం ఆరోపించింది. అయితే ఈ ఘటన అనంతరం అయిషీపైనా కేసు నమోదైంది. దాడి ఘటనకు ఒకరోజు ముందు వర్సిటీ సర్వర్‌ రూంను ధ్వంసం చేసినందుకు గానూ.. అయిషీ సహా పలువురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జేఎస్‌యూ విద్యార్థి సంఘం తొలి సిట్టింగ్‌ అధ్యక్షురాలు ఈమే కావడం విశేషం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌.. బిహార్‌లోని బెగుసరయ్‌ నుంచి వామపక్ష అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.