భారత జెండాల అండలో పాక్‌,టర్కీ విద్యార్థులు

ఉక్రెయిన్‌ దాటేందుకు జెండా సాయంతో ముందుకు
న్యూఢల్లీి,మార్చి2(జనం సాక్షి): ఉక్రెయిన్‌ పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల అక్కడ చదువుకుంటున్న వివిద దేశాలకు చెందిన విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆయా దేశాలు తమ విద్యార్థుల కోసం ఉక్రెయిన్‌ ప్రభుత్వంతో పాటు చుట్టు పక్కల ఉన్న దేశాలతో కూడా మంతనాలు సాగిస్తున్నాయి. ఈ తరహాలోనే భారత ప్రభుత్వం కూడా ఉక్రెయిన్‌లో ఉన్న భారత విద్యార్థులను తరలించడానికి చుట్టు పక్కల దేశాలను ఉపయోగించుకుంటోంది. యుద్ధం వల్ల చిక్కుకుపోయిన విద్యార్థులను రొమానియాకు బస్సుల ద్వారా తరలించి అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానాల ద్వారా ఇండియాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో భారత విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సులకు భారత దేశ జెండాను పెట్టుకొని బయలు దేరాలని సూచించింది. దాంతో భారత విద్యార్థులు జెండా పెట్టుకొని గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఇదే అవకాశాన్ని పాక్‌, టర్కీ విద్యార్ధులు కూడా వాడుకుంటున్నారని ఇండియన్‌ స్టూడెంట్స్‌ చెబుతున్నారు. ’మా ప్లాట్‌ దగ్గర మమ్మల్ని చూసిన సైన్యం విూ దగ్గర ఇండియన్‌ ప్లాగ్‌ ఉంది, కాబట్టి విూరు భపడాల్సిన అవసరం లేదు అన్నారు. ఎలాగోలా ఇండియన్‌ ప్లాగ్‌ సిద్ధం చేసుకున్నాం. మా బస్సు ముందు రెండు పెద్ద భారతీయ జెండాలు పెట్టుకున్నాం. అది చాలా ఉపయోగపడిరది. అందరూ మమ్మల్ని భారతీయ
వైద్య విద్యార్థులు అనుకున్నారు. దాంతో మాకు అన్ని చోట్లా ముందుకు వెళ్లేందుకు అనుమతి లభించిందన్నారు.