మరింత తగ్గిన బంగారం, వెండి

y0hzdshg హైదరాబాద్‌: డిమాండు తగ్గడంతో బంగారం, వెండి ధరలు ఈరోజు మరింత దిగివచ్చాయి. బంగారం ధర రూ.115 తగ్గింది. దీంతో పది గ్రాముల పసిడి ధర రూ.26,575కు చేరింది. వెండి చెప్పుకోదగ్గ రీతిలో 800 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.37200కి చేరింది. రీటైలర్లు, నగల వ్యాపారులు ఎక్కువగా కొనుగోళ్లకు రాకపోవడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావం వల్ల ధరలు దిగివస్తున్నాయని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.