మహిళలకు పటిష్ఠ భద్రత: ప్రధాని

ఢిల్లీ: మహిళలకు పటిష్ఠ భద్రత కల్పిస్తామనిప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలియజేశారు. ఢిల్లీ ఆందోళనలు, ఘటనల నేపథ్యంలో ఆయన జాతి నుద్దేశించి ప్రసంగించారు. బాధితురాలికి తమ కుటుంబసభ్యులు కూడా సానుభూతి తెలిపారని అన్నారు. ఘటనపై వ్యక్తిగతంగా చింతిస్తున్నాం, బాధితురాలు త్వరగా కోలుకోవాలి తమ కుటుంబం ప్రార్ధిస్తుందని పేర్కొన్నారు. ప్రజల ఆందోళన అర్ధవంతమైనదే గానీ హింసాత్మక  ఘటనలు సరికాదని చెప్పారు. బాధితురాలిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, ఆందోళనకారులు సంయమనం పాటించాలని కోరారు.