మా సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి పెడుతోంది: మాజీ ప్రధాని మన్మోహన్

ఢిల్లీ:మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి మోడీ ప్రభుత్వం ప్రవేశ పెడుతోందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలోనే కొత్త పథకాలు వచ్చాయని మన్మోహన్ స్పష్టం చేశారు. తన పై వచ్చిన అవినీతి ఆరోపణలను మన్మోహన్ ఖండించారు. పదవిని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని..నాకుటుంబ సభ్యులు, బంధువులకు లాభం చేకూరేలా వ్యవహరించలేదన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించామన్నారు.