మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్న మిస్ ఇండియా

మిస్ ఇండియా మానుషి ఛిల్లర్ మిస్ వరల్డ్ గా ఎంపికైంది. 17 ఏళ్ల తర్వాత ఆ కిరీటం మళ్లీ భారత యువతికి దక్కింది. ఈ ఏడాది ఫెమినా మిస్ ఇండియాగా ఎంపికైన హర్యానాకు చెందిన మానుషి మిస్ వరల్డ్ గా ఎంపికైంది. ఫైనల్ లో 39 మంది పోటీ పడగా మానుషి విజేతగా నిలిచింది. ద్వితీయ స్థానంలో మెక్సికో యువతి, తృతీయ స్థానంలో ఇంగ్లాండ్ యువతి నిలిచింది.