ముందంజలో హిల్లరీ

వాషింగ్ట‌న్‌: అమెరికా ఎన్నిhillariక‌ల్లో అభ్య‌ర్థుల త‌ల‌రాత‌లు రోజురోజుకూ తారుమార‌వుతున్నాయి. తాజా సర్వేలో డెమొక్ర‌టిక్ అభ్య‌ర్థి హిల్ల‌రీ క్లింట‌న్ ఆధిక్యంలో కొన‌సాగుతున్న‌ట్లు తేలింది. వాషింగ్ట‌న్ పోస్ట్‌-ఏబీసీ ట్రాకింగ్ పోల్‌ను ఆదివారం విడుద‌ల చేశారు. ఈ పోల్‌లో హిల్ల‌రీ.. ట్రంప్‌పై ఐదు శాతం ఆధిక్యంలో ఉన్నారు. హిల్ల‌రీ 48 శాతంతో ట్రంప్ (43) క‌న్నా ముందున్నారు. శుక్రవారం విడుదలైన పోల్ లో హిల్లరీ 47, ట్రంప్ 43 శాతంతో ఉన్న విషయం తెలిసిందే. హిల్ల‌రీకి మ‌ద్ద‌తు తెలుపుతూనే ఆమెకు ఓటేస్తామ‌ని ఇందులో 55 శాతం మంది చెప్ప‌గా.. ట్రంప్‌కు మ‌ద్ద‌తు తెలిపింది మాత్రం 43 శాతం మాత్ర‌మే. ట్రంప్‌కు ఓటేసేవారిలో ఎక్కువ శాతం మంది హిల్ల‌రీని వ్య‌తిరేకిస్తున్న‌ట్లే చెప్పారు.