ములాయం ఆరోగ్యపట్ల రాహుల్ ఆందోళన

Rahul gandhi worry about mulayamsingh health

ఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ 10 రోజుల తరువాత మౌనం వీడారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలో రాహుల్ సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. వచ్చేవారం పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ ఆర్యోగ్యంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ములాయం త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాక్షించారు. ములాయం శ్వాస సంబంధ సమస్య, అనారోగ్యంతో బాధపడుతూ గుర్గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.