ముస్లిం సంఘాలతో చర్చలు సఫలం

వివాదాస్పద సన్

నివేశాల తొలగింపునకు ఒప్పుకున్న కమల్‌
విశ్వరూపానికి తొలగిన అడ్డంకులు
చెన్నై : ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్‌ భారీ వ్యయంతో నిర్మించిన విశ్వరూపం సినిమా విడుదలకు తమిళనాడులో అడ్డంకులు తొలగిపోయాయి. అక్కడి రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ముస్లిం సంఘాల నేతలో కమల్‌హాసన్‌ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సినిమాలోని ఏడు వివాదాస్పద సన్నివేశాలను తొలగించేందుకు ఆయన అంగీకరిం చారు. దీంతో ఆదివారం తమిళనాడులో సినిమా విడుదల కానుంది. ముస్లిం పెద్దలు కూడా సినిమాపై వేసిన దావాను ఉపసంహరించుకోవడంతో మార్గం సుగమమైంది. ప్రభుత్వంపై వేసిన కేసును కూడా ఉపసంహరించుకుంటున్నామని కమల్‌హాసన్‌ పేర్కొ న్నారు. సమస్య పరిష్కారానికి సహకరించిన రాష్ట్ర హోంశాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.