మృతుల సంఖ్య 10 వేలకు పైనే ఉంటుంది

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ స్పీకర్‌

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో వరద ప్రమాద మృతుల సంఖ్య 10 వేలకుపైనే ఉంటుందని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ గోవింద్‌సింగ్‌ వెల్లడించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. యాత్రికుల తరలింపునకు రాష్ట్రంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.