యుగాంతం అవుతుందట!
20 రోజుల్లో భూమిని ఢీ కొట్టనున్న నిబిరు గ్రహం
న్యూయార్క్,సెప్టెంబర్1(జనంసాక్షి): యుగాంతం.. ఇది చాలా ఏళ్లుగా వింటున్న మాట.. ఇప్పటికే చాలా మంది యుగాంతమైపోతుందని చాలా చెప్పారు. అయితే ఇప్పుడు డేవిడ్ విూడ్ అనే కాన్ స్పిరసీ థియరిస్ట్ యుగాంతం అవుతుందని చెబుతున్నారు. మరో 20 రోజుల్లో భూమిని నిబిరు అనే గ్రహం
ఢీకొట్టుతుందని ఆయన తెలిపారు. భూమి నామరూపాలు లేకుండా పోతుందని ఆయన గట్టిగా చెబుతున్నారు. యుగాంతం గురించి చాలా ఏళ్లుగా వాదిస్తున్న డేవిడ్ ఈ సారి తేదీని కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 20 నుంచి 23 తేదీల మధ్యలో నిబిరు గ్రహం భూ కక్ష్యలోకి వస్తుందని, దాని గురుత్వాకర్షణ శక్తికి భూమి అంతమవడం ఖాయమంటున్నారు. అయితే డేవిడ్ వాదనలు నాసాతో పాటూ పలువురు అంతరిక్ష శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. చిన్న చిన్న గ్రహ శకలాలు భూ కక్ష్యలోకి రావడం మామూలు విషయమేనని, కానీ వాటి వల్ల ఎలాంటి నష్టం జరగదంటున్నారు. ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.