రహస్యంగా దేవాలయాల కూల్చివేత

పెషావర్ లోని పురాతన హిందూదేవాలయాన్ని రహస్యంగా కూల్చివేత ప్రక్రియకు వ్యతిరేకంగా  పాకిస్థాన్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పెషావర్ ఓల్డ్ సిటీలోని 150 సంవత్సరాలు పురాతన దేవాలయాన్ని ఒక కమర్షియల్ ప్లాజా నిర్మించేందుకు కూల్చివేశారు. అత్యంత రహస్యంగా పురాతన హిందూదేవాలయాల  563b5934d15f0కూల్చివేత పనులు ప్రారంభించారని మీడియా ఈ రోజు పేర్కొంది. కాగా ఈ కూల్చివేతకు వ్యతిరేకంగా పెషావర్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇద్దరు పాకిస్థాన్ జాతీయులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.