రైల్లో ప్రయాణికులపై గొడ్డలితో దాడి

బెర్లిన్‌: జర్మనీలోని వుర్జ్‌బుర్గ్‌ నగరంలో ఓ ఆఫ్గాన్‌ యువకుడు బీభత్సం సృష్టించాడు. రైల్లోకి చొరబడి ప్రయాణికులపై గొడ్డలి, కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

త్రెచ్లింజెన్‌ – వుర్జ్‌బుర్గ్‌ మధ్య నడిచే రైలులో బవేరియా సమీపంలో 17 ఏళ్ల ఆఫ్గాన్‌ యువకుడు చొరబడి ప్రయాణికులపై కత్తి, గొడ్డలితో దాడిచేశాడు. అనంతరం రైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. పోలీసులు అతడ్ని కాల్చి చంపారు. యువకుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. దాడికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.