లభ్యం కాని 1800 మంది యాత్రికుల ఆచూకీ

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బద్రీనాథ్‌లో చిక్కుకున్న 2 వేల మందికిపైగా యాత్రికుల తరలింపునకు సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో 1800 మంది యాత్రికుల ఆచూకీ లభ్యం కానట్లు ప్రభుత్వం ప్రకటించింది.