విజేందర్‌ను ఎంపిక చేయలేదు : బాక్సింగ్‌ ఫెడరేషన్‌

న్యూఢీల్లీ : సైప్రన్‌ క్యూబాల్లో జరగనున్న బాక్సింగ్‌ టోర్నీలకు బాక్సర్‌ విజేందర్‌ను ఎంపిక చేయలేదని భారత బాక్సింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు అభిషేక్‌ మటోరియా తెలిపారు. మాదక ద్రవ్యాలను వినియోగించినట్లు విజేందర్‌పై ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలనుంచి విజేందర్‌ బయటకు వస్తాడన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.