సింగపూర్‌ పితామహుడు అంత్యక్రియలకు భారత ప్రధాని మోడీ

v4n83u27ఆధునిక సింగపూర్‌ పితామహుడు లీ క్వాన్‌ యూ అంత్యక్రియలకు భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నారు. లీ అంత్యక్రియలు ఈ నెల 29 న జరగనున్నాయి. భారత్‌, సింగపూర్ ల మధ్య ఉన్న సత్సంబంధాల కారణంగా ప్రధాని మోడీ స్వయంగా అంత్యక్రియల కార్యక్రమానికి హాజరవనున్నారు. ఈ నెల 25 నుంచి 28 వరకు నాలుగురోజుల పాటు అభిమానుల సందర్శనార్థం లీ మృతదేహాన్ని సింగపూర్ పార్లమెంట్ వద్ద ఉంచనున్నారు. 29 వ తేదీన అంత్యక్రియలు జరగనున్నాయి.