సినీహీరో యశోసాగర్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

కర్ణాటక : ఉల్లాసంగా… ఉత్సాహంగా సినిమా కథానాయకుడు యశోసాగర్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రంలో తుమకూరు జిల్లా శిరాలో బుధవారం ఉదయం 4 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో అతను మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ వచ్చేందుకు విమానం అందకపోవడంతో స్నేహితుడితో కలిసి సాగర్‌ కారులో బయలు దేరాడు. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సాగర్‌తోపాటు డ్రైవర్‌ కూడా మృతి చెందాడు. కన్నడ సినీ నిర్మాత సోము తనయుడైన యశోసాగర్‌ జులై 25, 2008లో విడుదలైన ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో స్నేహుల్లాల్‌తో కలిసి నటించాడు. యశోసాగర్‌ మిస్టర్‌ ప్రేమికుడు అనే చిత్రం షూటింగ్‌ దశలో ఉంది.