సిరియాలో ఐఎస్ ఘాతుకం

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సిరియాలోని హోమ్స్ రాష్ట్రంలో తొమ్మిది రోజులుగా యథేచ్ఛగా మారణకాండ కొనసాగిస్తున్నారు. పురాతన పట్టణమైన పాల్మైరాలో ఉగ్రవాదులు పలువురు పౌరులు సహా 217 మందిని ఉరి తీశారని బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది. మృతుల్లో 67 మంది పౌరులు, 150 మంది సిరియా ప్రభుత్వ అనుకూల సైనిక జవాన్లు ఉన్నట్లు తెలిపింది. ఉరితీతకు గురైన పౌరుల్లో 14 మంది బాలలు, 12 మంది మహిళలున్నారు.