సుశీల్‌కుమార్‌ షిండేతో ముగిసిన సీఎం భేటీ

ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు ఆరగంట పాటు వివిధ అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. తెలంగాణ అంశంపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో షిండేతో ముఖ్యమంత్రి భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.