హ్యూస్టన్‌ విమానాశ్రయం వద్ద వ్యక్తి ఆత్మహత్య

వాషింగ్టన్‌ : హ్యూస్టన్‌లోని బుష్‌ విమానాశ్రయంలో ఒక వ్యక్తి తనను తాను తుపాకీతో కాల్చుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. హ్యూస్టన్‌ పోలీసుశాఖ ప్రతినిధి కీన్‌ స్మిత్‌ మీడియాతో మాట్లాడుతూ బి టెర్మినల్‌ నుంచి వెలుపలికి వచ్చిన ఒక వ్యక్తి తన వద్ద ఉన్న సెమీ ఆటోమేటిక్‌ తుపాకీతో పైకప్పుని కాల్చటం ప్రారంభించిన వెంటనే అప్రమత్తమైన సమీప పోలీసు అధికారి ఒకరు అతడిపై కాల్పులు జరిపారని.. ఇంతలో అతను తన వద్ద ఉన్న తుపాకీతో తనను తాను కాల్చుకున్నాడని చెప్పారు. ఈ ఉదంతంతో బుష్‌ విమానాశ్రయానికి రావాల్సిన అన్ని విమానాలు అలస్యంగా నడిచాయి.