సైనిక విమానం కూలి 103 మంది దుర్మరణం

హైదరాబాద్‌: అల్జీరియా దేశంలో సైనిక రవాణా విమానం ఒకటి కూలి పోయింది. ఈ ప్రమాదంలో 103 మంది దుర్మరణం పాలయ్యారని భావిస్తున్నారు. అల్జీరియా ఈశాన్య ప్రాంతంలోని పర్వత ప్రాంతంలో ఈ విమానం కూలిపోయింది. ప్రమాణికులంతా సైనికులేనని సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సహాయ చర్యల నిమిత్తం బృందాలుగా బయల్దేరినట్లు అధికారలు తెలిపారు.