112కు చేరిన కేరళ ప్రమాద మృతుల సంఖ్య

2

కేరళలోని కొల్లం పుట్టింగల్‌ ఆలయ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు 112మంది చనిపోగా.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు..ప్రమాదానికి కారణమైన ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో బాణాసంచా పేలుళ్లకు అనుమతి లేకున్నా కాల్చడంతో.. ఆలయ అధికారితో పాటు, కార్యవర్గ సభ్యుల్ని అదుపులోకి తీసుకుని.. విచారణ ప్రారంభించారు.