రాణిస్తున్న భారత్‌ బౌలర్లు ..కష్టాల్లో దక్షిణాఫ్రికా 205/4

జొహనెన్‌బర్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టుమ్యాచులో భారత్‌ బౌలర్లు రాణిస్తున్నారు. ఓవర్‌నైట్‌ 138/2 స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీలను ఆదిలోనే షమి దెబ్బతీశారు. నాల్గొరోజు అర్ధశతకంతో రాణించి ప్రమాదకరంగా మారుతున్న పీటర్స్‌ను(76)ను షమి పెవిలియన్‌ పంపాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్‌ కలిన్‌(34)ను జహీర్‌కాన్‌ ఔట్‌ చేసి దక్షిణాఫ్రికాను ఆత్మరక్షణలో పడేశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. క్రీజులో డు ప్లెసిన్‌(32), డివిలియర్‌(4) ఉన్నారు. దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా పరుగులు చేయాల్సి ఉంది.