24వ సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం
బెంగళూరు( జనం సాక్షి): కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. విధానసౌద ఆవరణలో గవర్నర్ వాజుభాయ్ వాలా ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంతో దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ, సోనియాగాంధీ, మాయావతి, అఖిలేష్ యాదవ్, శరద్ యాదవ్, మమతా బెనర్జీ, సీతారాం ఏచూరి, చంద్రబాబు నాయుడులాంటి నేతలంతా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.