హైకమాండ్‌ నిర్ణయాన్ని గౌరవించాలి: పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయాన్ని ఇరు ప్రాంతాల నేతలు గౌరవించాలని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణే ఏర్పాటు అవుతుందని ఆయన తెలిపారు. రాయల తెలంగాణ ప్రతిపాదన హైకమాండ్‌ వద్ద స్పష్టం చేశారు.